

విక్టరీ వెంకటేష్, దర్శకుడు అనిల్ రావిపూడి కాంబినేషన్లో 5వ సినిమా రూపొందనుంది. ఈ చిత్రంలో నందమూరి కళ్యాణ్ రామ్ మరో హీరోగా నటించనున్నాడు. 2027 సంక్రాంతికి ఈ సినిమాను విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు. మొదటగా వెంకటేష్ సరసన కీర్తి సురేశ్ నటిస్తారని వార్తలు వచ్చినప్పటికీ, అధికారికంగా ఇంకా కన్ఫర్మ్ కాలేదు. అలాగే కళ్యాణ్ రామ్ సరసన ఎవరు నటిస్తారన్నదానిపై స్పష్టత లేదు.
అయితే ఇటీవల జరిగిన ‘LIK’ ఈవెంట్లో దర్శకుడు అనిల్ రావిపూడి పరోక్షంగా కృతి శెట్టినే హీరోయిన్గా ఎంపికైనట్లు సంకేతాలు ఇచ్చాడు. త్వరలో సెట్స్లో కలుద్దామని ఆమె చెప్పిందని, అధికారిక ప్రకటన అవసరం లేదని ఆయన వ్యాఖ్యానించారు. దీంతో కళ్యాణ్ రామ్ సరసన కృతి శెట్టి నటించడం దాదాపు ఖరారైనట్లుగా భావిస్తున్నారు. ‘బంగార్రాజు’ తర్వాత సరైన హిట్ లేక ఇబ్బందుల్లో ఉన్న కృతి శెట్టికి ఇది కీలక అవకాశం కాగా, హిట్ కోసం ఎదురుచూస్తున్న కళ్యాణ్ రామ్కి కూడా ఇది ముఖ్యమైన ప్రాజెక్ట్గా మారింది.






















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!