

శర్వానంద్ హీరోగా, శ్రీను వైట్ల దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘జార్జ్ క్రిష్’ చిత్రానికి సంబంధించిన మరో ఆసక్తికర వార్త సినీ వర్గాల్లో చర్చనీయాంశమైంది. హీరోయిన్ ఎంపిక విషయంలో ఇప్పటికే పలువురు హీరోయిన్ల పేర్లు వినిపించినప్పటికీ, తాజాగా రాషా థడానీ పేరు ప్రధానంగా ప్రచారంలోకి వచ్చింది. గతంలో భాగ్యశ్రీ బోర్సే నటిస్తారనే వార్తలు వచ్చినా, ప్రస్తుతం రాషా థడానీ ఈ చిత్రంలో నటించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని సమాచారం. అయితే దీనిపై చిత్రబృందం నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
ఈ ప్రచారం నిజమైతే ‘శ్రీనివాస మంగాపురం’ తర్వాత రాషా థడానీకి మరో కీలక తెలుగు సినిమా దక్కినట్టే అవుతుంది. ఆగస్టు రెండో వారంలో తొలి షెడ్యూల్ ప్రారంభించి, హీరో–హీరోయిన్లపై కీలక ప్రేమకథ సన్నివేశాలను చిత్రీకరించేందుకు చిత్రబృందం సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. సంక్రాంతి విడుదల లక్ష్యంగా నిర్మాణ పనులు వేగంగా కొనసాగుతున్నాయి. ‘విశ్వం’ తర్వాత మరో విజయాన్ని అందుకోవాలనే లక్ష్యంతో దర్శకుడు శ్రీను వైట్ల ఈ చిత్రాన్ని ప్రతిష్ఠాత్మకంగా రూపొందిస్తున్నట్లు సినీ వర్గాలు చెబుతున్నాయి.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!