
జనరల్

సువిక్షిత్, గీతికా రతన్ జంటగా యదార్థ సంఘటన ఆధారంగా రూపొందిన ఫీల్గుడ్ లవ్ ఎంటర్టైనర్ “దూరదర్శని” ఈ నెల 15న ప్రేక్షకుల ముందుకు రానుంది. కార్తికేయ కొమ్మి దర్శకత్వంలో వారాహ మూవీ మేకర్స్ పతాకంపై జయ శంకర్ రెడ్డి ఎం, పాటిమీది సంతోష్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్ హైదరాబాద్లో ఘనంగా జరిగింది.
ఈ కార్యక్రమంలో పాల్గొన్న నటుడు ప్రియదర్శి మాట్లాడుతూ దూరదర్శన్ కాలం గుర్తొస్తూ సినిమా తనను ఎంతో భావోద్వేగానికి గురిచేసిందని తెలిపారు. ఈ సినిమా ప్రేక్షకుల హృదయాలకు హత్తుకుని మంచి విజయాన్ని సాధించాలని ఆకాంక్షించారు. చిత్రబృందం కూడా సినిమా భావోద్వేగాలు, సహజమైన కథనం ప్రధాన ఆకర్షణగా ఉంటాయని పేర్కొన్నారు.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!