
రాజకీయాలు

వాట్సాప్ యూజర్నేమ్ ఫీచర్పై ఇప్పటికే నోటీసులు జారీ చేసిన కేంద్ర ప్రభుత్వం, ఇప్పుడు టెలిగ్రామ్ మరియు సిగ్నల్ మెసేజింగ్ ప్లాట్ఫార్మ్లపైనా దృష్టి సారించింది. యూజర్నేమ్ ఫీచర్ అమలుపై వివరణ ఇవ్వాలని కేంద్ర ఐటీ శాఖ త్వరలోనే ఈ రెండు సంస్థలకు నోటీసులు జారీ చేయనుంది.
యూజర్నేమ్ ఫీచర్లో భద్రత, గుర్తింపు ధృవీకరణ, దుర్వినియోగ అవకాశాలపై కేంద్రం సమగ్ర వివరాలు కోరుతోంది. ఈ ఫీచర్ ద్వారా నకిలీ గుర్తింపులు, మోసాలు, సైబర్ నేరాలకు అవకాశం ఉండొచ్చనే ఆందోళనల నేపథ్యంలో ప్రభుత్వం ఈ చర్యలు చేపడుతోంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!