
ఆరోగ్యం

వంశీ పైడిపల్లి, సల్మాన్ ఖాన్ కాంబినేషన్లో భారీ యాక్షన్ డ్రామా రూపొందుతోంది. ఇందులో నయనతార హీరోయిన్గా నటిస్తుండగా, అరవింద్ స్వామి కీలక పాత్రలో కనిపించనున్నారు. ముఖ్యంగా ఆయన నెగటివ్ పాత్ర కాకుండా పాజిటివ్ రోల్లో నటించనుండటం విశేషం. ఇక విలన్ పాత్ర కోసం అనిల్ కపూర్ ను సంప్రదిస్తున్నట్లు సమాచారం. ఆయన అంగీకరిస్తే సినిమా స్థాయి మరింత పెరిగే అవకాశం ఉంది.
‘వారసుడు’ విజయానంతరం వంశీ పైడిపల్లి ఈ భారీ ప్రాజెక్టును తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రాన్ని దిల్రాజు, శిరీష్లు శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్పై నిర్మిస్తున్నారు. కుల్దీప్ రాథోడ్, రఫీ కాజీ సహ నిర్మాతలుగా ఉన్నారు. ఈ సినిమా షూటింగ్ ఈ నెలలో ప్రారంభం కానుండగా, మరిన్ని వివరాలు త్వరలో వెల్లడించనున్నారు. ఈ ప్రాజెక్ట్ బాలీవుడ్–టాలీవుడ్ మధ్య వారధిగా నిలుస్తుందని భావిస్తున్నారు.






















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!