

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి జీవనాడిగా భావించే పోలవరం ప్రాజెక్టు పూర్తి దిశగా ప్రభుత్వం మరో కీలక ఘట్టాన్ని చేరుకుంది. ప్రాజెక్టులో అత్యంత ముఖ్యమైన 1372 మీటర్ల పొడవైన డయాఫ్రం గోడను తక్కువ సమయంలో పూర్తి చేశారు. ఈ సందర్భంగా ఇరిగేషన్ శాఖ అధికారులు, ఇంజనీర్లను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అభినందించారు. అలాగే కేంద్ర సంస్థలు మరియు పోలవరం ప్రాజెక్టు అధికారుల సహకారానికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు.
గత ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా ముందుగా నిర్మించిన డయాఫ్రం గోడ దెబ్బతిన్నదని, దానిని తిరిగి నిర్మించడానికి అదనంగా వెయ్యి కోట్ల రూపాయలు ఖర్చు చేయాల్సి వచ్చిందని సీఎం తెలిపారు. ఇప్పుడు డయాఫ్రం గోడ పూర్తి కావడంతో ప్రధాన నిర్మాణమైన ఎర్త్ కమ్ రాక్ ఫిల్ డ్యామ్ పనులు వేగంగా ముందుకు సాగనున్నాయి.
ఇప్పటికే ప్రకటించినట్లుగా అన్ని పనులను పూర్తి చేసి వచ్చే ఏడాది పుష్కరాల కంటే ముందే పోలవరం ప్రాజెక్టును దేశానికి అంకితం చేస్తామని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ పురోగతి ఆ లక్ష్యానికి ఒక ముఖ్యమైన అడుగుగా నిలిచింది.






















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!