

హైదరాబాద్లోని ప్యారడైజ్ జంక్షన్ వద్ద ప్రతిపాదిత ఎలివేటెడ్ కారిడార్లను రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు ఆదివారం పరిశీలించారు. హైదరాబాద్ మెట్రో రైల్ ఎండీ సర్ఫరాజ్ అహ్మద్, ఐఏఎస్, ఇతర ఉన్నతాధికారులతో కలిసి కారిడార్ల అలైన్మెంట్, కనెక్టివిటీ, భూసేకరణ, మౌలిక వసతుల అవసరాలను ఆయన సమీక్షించారు. ప్యారడైజ్ నుంచి డెయిరీ ఫార్మ్ రోడ్ వరకు NH-44పై, అలాగే ప్యారడైజ్ నుంచి బొల్లారం, గన్రాక్ ఎన్క్లేవ్, శామీర్పేట్ మీదుగా ORR జంక్షన్ వరకు SH-1 (రాజీవ్ రహదారి)పై ప్రతిపాదించిన కారిడార్ల ప్రణాళికలను అధికారులు సీఎస్కు వివరించారు.
ఈ ఎలివేటెడ్ కారిడార్లు అందుబాటులోకి వస్తే ప్యారడైజ్, సికింద్రాబాద్, బొల్లారం, గన్రాక్ ఎన్క్లేవ్, శామీర్పేట్ ప్రాంతాల మధ్య రవాణా కనెక్టివిటీ మెరుగుపడనుంది. ఉత్తర హైదరాబాద్ నుంచి ORRకు వేగవంతమైన అనుసంధానంతో పాటు ప్రధాన రహదారులపై ట్రాఫిక్ రద్దీ తగ్గే అవకాశం ఉంది. భూసేకరణ, యుటిలిటీల మార్పిడి, వివిధ శాఖల సమన్వయం, అనుమతులకు సంబంధించిన అంశాలను వేగంగా పరిష్కరించాలని సంజయ్ జాజు అధికారులను ఆదేశించారు. భవిష్యత్ ట్రాఫిక్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని మెట్రో రైల్, ప్రధాన రహదారులు, ORRతో సమగ్ర అనుసంధానం ఉండేలా ప్రణాళికలు రూపొందించాలని సూచించారు.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!