

పశ్చిమాసియా సంక్షోభం ప్రభావంతో దేశ విదేశీ మారక ద్రవ్య నిల్వలపై ఒత్తిడి పెరుగుతోంది. ఈ పరిస్థితిని ఎదుర్కొనేందుకు భారతీయ రిజర్వు బ్యాంకు పలు చర్యలు చేపడుతోంది. ఇందులో భాగంగా తన వద్ద ఉన్న బంగారం నిల్వల్లో కొంత భాగాన్ని విక్రయించి వాటి ద్వారా డాలర్లను సమీకరిస్తున్నట్లు సమాచారం.
వార్తా సంస్థల కథనాల ప్రకారం, గత నెల 22తో ముగిసిన రెండు వారాల్లో రిజర్వు బ్యాంకు సుమారు 1,200 కోట్ల డాలర్ల విలువైన బంగారాన్ని విక్రయించింది. ఇందులో దాదాపు 750 కోట్ల డాలర్లను విదేశీ మారక ద్రవ్య నిల్వల్లో జమ చేసినట్లు వెల్లడైంది. రూపాయి మారకపు విలువపై ఒత్తిడిని తగ్గించడమే ఈ చర్యల ప్రధాన లక్ష్యంగా భావిస్తున్నారు.
ఇక విదేశీ మారక ద్రవ్య నిల్వలను కాపాడేందుకు ప్రభుత్వం వెండి దిగుమతుల నిబంధనలను మరింత కఠినతరం చేసింది. చెల్లుబాటయ్యే అనుమతి పత్రాలు ఉన్నవారికే వెండి దిగుమతులకు అనుమతి ఇవ్వనున్నట్లు స్పష్టం చేసింది. చమురు ధరల పెరుగుదల, విదేశీ పెట్టుబడుల ఉపసంహరణ, పెరుగుతున్న ద్రవ్యోల్బణం వంటి అంశాలు ఆర్థిక వ్యవస్థపై ప్రభావం చూపుతున్న నేపథ్యంలో నిల్వల పరిరక్షణకు ప్రభుత్వం, రిజర్వు బ్యాంకు చర్యలు వేగవంతం చేశాయి.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!