
క్రీడలు

నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) డైరెక్టర్ జనరల్ అభిషేక్ సింగ్ నీట్ యూజీ 2026 ప్రశ్నపత్రం లీక్ ఆరోపణలపై పార్లమెంటరీ కమిటీ ముందు కీలక వ్యాఖ్యలు చేశారు. పేపర్ లీక్ జరిగిందని ఇప్పుడే అంగీకరించలేమని, సీబీఐ విచారణ పూర్తయిన తర్వాతే అసలు విషయాలు వెల్లడవుతాయని ఆయన పేర్కొన్నారు.
కాంగ్రెస్ ఎంపీ దిగ్విజయ్ సింగ్ నేతృత్వంలోని విద్య, యువజన వ్యవహారాల పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ ముందు ఎన్టీఏ అధికారులు హాజరయ్యారు. ఈ ఘటనపై దేశవ్యాప్తంగా ఆందోళన వ్యక్తమవుతోంది. పేపర్ లీక్ కారణంగా జూన్ 21, 2026న రీ ఎగ్జామ్ నిర్వహించనున్నట్లు సమాచారం.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!