

పాలిటెక్నిక్ విద్యను బలోపేతం చేసి, పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా విద్యార్థులకు నైపుణ్య శిక్షణ, మెరుగైన ఉపాధి అవకాశాలు కల్పించేందుకే పరిపాలనా పునర్వ్యవస్థీకరణ చేపట్టినట్లు మంత్రి వివేక్ వెంకటస్వామి తెలిపారు. పాలిటెక్నిక్, ఐటీఐలను శక్తి విభాగం పరిధిలోకి తీసుకురావడం వల్ల లేటరల్ ఎంట్రీ రద్దు కాదని, ఫీజులు పెరగవని స్పష్టం చేశారు. మూడేళ్ల డిప్లొమా కోర్సు, ప్రస్తుత ఫీజులు యథాతథంగా కొనసాగుతాయని తెలిపారు. ఉద్యోగుల ప్రయోజనాలకు ప్రభుత్వం పూర్తి భరోసా ఇస్తుందని, భవిష్యత్ నియామకాలు టీజీపీఎస్సీ ద్వారానే జరుగుతాయని చెప్పారు.
పాలిటెక్నిక్లను పరిశ్రమలతో అనుసంధానం చేసేందుకు టాటా టెక్నాలజీస్తో పదేళ్లకు రూ.2,300 కోట్ల విలువైన ఒప్పందం కుదిరిందని మంత్రి వెల్లడించారు. ఇప్పటికే 200కుపైగా పరిశ్రమలతో ప్లేస్మెంట్లు, శిక్షణ, అప్రెంటిస్షిప్, ఇంటర్న్షిప్, కరిక్యులమ్ అప్గ్రేడేషన్ కోసం ఎంవోయూలు కుదిరాయని తెలిపారు. ప్రతి పాలిటెక్నిక్లో ప్రత్యేక ప్లేస్మెంట్ సెల్ ఏర్పాటు చేస్తామని, కళాశాలల భూములు, భవనాలు, ఆస్తులను స్కిల్స్ యూనివర్సిటీకి బదిలీ చేయబోమని స్పష్టం చేశారు. ఈసెట్ ద్వారా ఇంజినీరింగ్లో లేటరల్ ఎంట్రీ కొనసాగుతుందని, ఏటీసీల్లో ఈడబ్ల్యూఎస్ విద్యార్థులకు అందిస్తున్న రూ.2 వేల స్టైపెండ్ను పాలిటెక్నిక్ విద్యార్థులకు కూడా వర్తింపజేస్తామని తెలిపారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!