
జనరల్

నైరుతి రుతుపవనాలు మరో మూడు నుంచి నాలుగు రోజుల పాటు చురుగ్గా కొనసాగనున్న నేపథ్యంలో దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశముందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) వెల్లడించింది. ఉత్తర, తూర్పు, ఈశాన్య భారత రాష్ట్రాలతో పాటు గుజరాత్, మహారాష్ట్రలో భారీ నుంచి అతి భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉందని తెలిపింది.
జమ్ముకశ్మీర్, హిమాచల్ ప్రదేశ్, లడఖ్ ప్రాంతాల్లో కూడా భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ హెచ్చరించింది. భారీ వర్షాల కారణంగా వరదలు, నీటి నిల్వలు, రవాణా అంతరాయాలు ఏర్పడే అవకాశం ఉన్నందున ప్రజలు అధికారిక హెచ్చరికలను పాటిస్తూ అప్రమత్తంగా ఉండాలని సూచించింది.












కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!