
జనరల్

ప్రాచీన భారత మూలాలున్న యోగా ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా వ్యాప్తి చెందిందని, అన్ని మతాలకు చెందిన లక్షల మందికి ఇది ప్రయోజనకరమని ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరస్ అన్నారు. ఐరాస ప్రధాన కార్యాలయంలో 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని నిర్వహించిన కార్యక్రమంలో యోగా సాధకులు, దౌత్యవేత్తలు, ఐరాస అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా గుటెరస్ 2028-29 నాటికి ఐరాస భద్రతా మండలిలో భారత్ తాత్కాలిక సభ్యత్వాన్ని ప్రస్తావించారు.
చైనాలోని బీజింగ్లో భారత రాయబార కార్యాలయంలో నిర్వహించిన యోగా కార్యక్రమంలో వెయ్యికి పైగా యోగా ఔత్సాహికులు పాల్గొన్నారు. ఎక్కువ మంది చైనా పౌరులు ఉండటం విశేషమని భారత రాయబారి విక్రమ్ దొరైస్వామి తెలిపారు. యోగా ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న ఆదరణకు ఇది నిదర్శనమని ఆయన పేర్కొన్నారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!