

యంగ్ హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ ఇటీవల సోషల్ మీడియాలో షేర్ చేస్తున్న విభిన్న పోస్టులు నిత్యం చర్చనీయాంశంగా మారుతున్నాయి. తమిళ హీరో ధృవ్ విక్రమ్తో ప్రేమాయణం నడిపి, ఇటీవల బ్రేకప్ చెప్పిందనే వార్తలు నెట్టింట వైరల్ కావడంతో, ఆమె పోస్టులు వ్యక్తిగత బాధను ప్రతిబింబిస్తున్నాయనే ఊహాగానాలు వినిపించాయి. ఈ నేపథ్యంలో ఆమె ఇన్స్టాగ్రామ్ పోస్టులపై నెటిజన్లు రకరకాల అభిప్రాయాలు వ్యక్తం చేశారు.
ఈ పుకార్లపై తాజాగా స్పందించిన అనుపమ, తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ విమర్శకులకు గట్టి కౌంటర్ ఇచ్చారు. తన సోషల్ మీడియా ఖాతాలో ఏమి పోస్ట్ చేయాలనేది పూర్తిగా తన వ్యక్తిగత హక్కు అని స్పష్టం చేశారు. తన పోస్టులు సానుభూతి కోసం కాదని, ఒక సాధారణ మహిళ జీవితంలో ఎదురయ్యే మార్పుల గురించేనని తెలిపారు. తన వ్యక్తిగత జీవితంపై బయటివారు వ్యాఖ్యానించడం సరైంది కాదని ప్రశ్నించారు. ఇక సినిమాల విషయానికి వస్తే, ప్రస్తుతం ఆమె ‘క్రేజీ కళ్యాణం’ చిత్రంలో నటిస్తూ బిజీగా ఉన్నారు. తన వ్యాఖ్యలతో పాటు కెరీర్పై దృష్టి పెట్టిన అనుపమ ఇప్పుడు టాలీవుడ్లో హాట్ టాపిక్గా మారింది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!