
జనరల్

2026–27 విద్యా సంవత్సరానికి తెలంగాణ ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో ఇంటర్ ఫస్ట్ ఇయర్లో 85,453 మంది విద్యార్థులు చేరి రికార్డు సృష్టించారు. గత ఏడాదితో పోలిస్తే ఇది 14 శాతం అధికం. ప్రస్తుతం ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ కలిపి మొత్తం 1,64,730 మంది విద్యార్థులు ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో విద్యనభ్యసిస్తున్నారు.
నాణ్యమైన విద్య, ఆధునిక మౌలిక సదుపాయాలు, ఉచిత భోజన పథకం, అలాగే ఐబీఎం, హెటెరో వంటి ప్రముఖ సంస్థల సహకారంతో నైపుణ్యాభివృద్ధి శిక్షణ, ఉపాధి అవకాశాలు కల్పించడం వల్లే అడ్మిషన్లు గణనీయంగా పెరిగాయని ఇంటర్ బోర్డు అధికారులు తెలిపారు. ఈ చర్యలు ప్రభుత్వ జూనియర్ కాలేజీలపై విద్యార్థులు, తల్లిదండ్రుల విశ్వాసాన్ని మరింత పెంచుతున్నాయి.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!