

కర్ణాటక కాంగ్రెస్ పార్టీలో తాజా కేబినెట్ విస్తరణతో అంతర్గత విభేదాలు బయటపడుతూ రాజకీయ కలకలం రేపుతున్నాయి. విస్తరణ అనంతరం జరిగిన ప్రమాణ స్వీకార కార్యక్రమానికి మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య హాజరుకాకపోవడం పార్టీ అంతర్గత పరిస్థితులపై అనుమానాలకు తావిచ్చింది. ఆయన గైర్హాజరు పార్టీ లోపల అసంతృప్తి పెరుగుతోందనే సంకేతంగా రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
ఇక కేబినెట్లో చోటు దక్కకపోవడంతో కాంగ్రెస్ ఎమ్మెల్యే యశ్వంత్రయ గౌడ రాజీనామా చేయడం పరిస్థితిని మరింత ఉద్రిక్తంగా మార్చింది. త్వరలో మరో 10 మంది ఎమ్మెల్యేలు కూడా రాజీనామా చేసే అవకాశముందని రాజకీయ వర్గాల్లో చర్చలు సాగుతున్నాయి. ఈ రాజీనామాలకు సిద్ధరామయ్య వర్గానికి చెందిన నాయకులే కారణమని, వారి వర్గాన్ని ఉద్దేశపూర్వకంగా పక్కన పెట్టారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ పరిణామాలు పార్టీ ఐక్యతపై సందేహాలను కలిగిస్తున్నాయి.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!