
జనరల్

హైదరాబాద్లో ట్రాఫిక్ రద్దీని తగ్గించేందుకు మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో రెండు కీలక ఫ్లైఓవర్ల నిర్మాణానికి స్టాండింగ్ కమిటీ ఆమోదం తెలిపింది. మొత్తం రూ.685 కోట్ల అంచనా వ్యయంతో నాగోల్–బండ్లగూడ, హస్తినాపురం–బీఎన్రెడ్డి మార్గాల్లో ఈ ప్రాజెక్టులు చేపట్టనున్నారు.
సాగర్ హైవేపై హస్తినాపురం, బీఎన్రెడ్డినగర్, సాగర్ కాంప్లెక్స్ జంక్షన్ల వద్ద రూ.550 కోట్లతో 3.2 కిలోమీటర్ల పొడవైన ఆరు లేన్ల ఫ్లైఓవర్ నిర్మించనున్నారు. అదేవిధంగా నాగోల్–బండ్లగూడ మార్గంలో రూ.135 కోట్లతో రెండు లేన్ల ఫ్లైఓవర్ నిర్మాణం చేపట్టనున్నారు. తుది అనుమతుల కోసం ప్రతిపాదనలను రాష్ట్ర ప్రభుత్వానికి పంపినట్లు అధికారులు తెలిపారు.

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!