
క్రీడలు

మెగా డీఎస్సీ నియామకాలపై సీబీఐ విచారణ జరిపించాలని కోరుతూ వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ పర్వతరెడ్డి దాఖలు చేసిన ప్రజాప్రయోజన వ్యాజ్యాన్ని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తిరస్కరించింది. ఈ కేసును విచారించిన ధర్మాసనం, స్పోర్ట్స్ కోటా కారణంగా అన్యాయం జరిగిందని భావిస్తున్న అభ్యర్థులు నేరుగా కోర్టును ఎందుకు ఆశ్రయించలేదని ప్రశ్నించింది. నిజంగా నష్టం జరిగి ఉంటే బాధితులే న్యాయస్థానాన్ని ఆశ్రయించాల్సిన అవసరం ఉందని పేర్కొంది.
బాధితులు కోర్టుకు రావడానికి భయపడుతున్నారన్న పిటిషనర్ వాదనను అంగీకరించలేమని హైకోర్టు స్పష్టం చేసింది. రాజకీయ ప్రయోజనాల కోసం ప్రజాప్రయోజన వ్యాజ్యాలను అనుమతిస్తే వాటి అసలు ఉద్దేశం దెబ్బతింటుందని ధర్మాసనం వ్యాఖ్యానించింది. ఈ నేపథ్యంలో మెగా డీఎస్సీపై సీబీఐ విచారణకు ఆదేశాలు ఇవ్వాలని చేసిన అభ్యర్థనను కోర్టు తిరస్కరించింది.

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!