
జనరల్

తెలంగాణలోని థియేటర్ యజమానులు కీలక సమావేశానికి సిద్ధమయ్యారు. శనివారం సాయంత్రం 3 గంటలకు తెలుగు ఫిలిం ఛాంబర్లోని నిర్మాతల మండలి హాల్లో ఈ భేటీ జరగనుంది. పర్సంటేజ్ సిస్టమ్ వివాదంపై ఎగ్జిబిటర్లు ఈ సమావేశంలో కీలక నిర్ణయం తీసుకోనున్నారు.
థియేటర్ యజమానులు, నిర్మాతల మధ్య కొనసాగుతున్న ఈ వివాదం టాలీవుడ్లో ప్రతిష్టంభనకు దారితీసింది. భవిష్యత్తు కార్యాచరణపై స్పష్టత రానుంది. థియేటర్ల బంద్ దిశగా అడుగులు పడే అవకాశముందా అనే అంశంపై సినీ వర్గాల్లో ఉత్కంఠ నెలకొంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!