
జనరల్

టీడీపీ అధినేత, సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగిన పొలిట్బ్యూరో సమావేశం ముగిసింది. ఈ సమావేశంలో రాబోయే మహానాడు నిర్వహణపై ప్రధానంగా చర్చ జరిగింది. పార్టీ నేతలకు మహానాడు నిర్వహణపై చంద్రబాబు కీలక దిశానిర్దేశం చేశారు.
‘‘కార్యకర్తే అధినేత అనే భావన మహానాడులో ప్రతిబింబించాలి. మహిళలకు పార్టీ ఇస్తున్న ప్రాధాన్యం స్పష్టంగా ప్రజలకు చేరాలి. సంప్రదాయ ఓటు బ్యాంకును కాపాడుకోవాలి. 50 శాతం జనాభా ఉన్న బీసీలు పార్టీకి వెన్నుదన్నుగా ఉన్నారు. వారి అభివృద్ధికి టీడీపీ కట్టుబడి ఉందనే సందేశం ఇవ్వాలి. హైబ్రిడ్ విధానంలో జరిగే మహానాడును విజయవంతం చేయాలి. ఉదయం 9 గంటల నుంచే కార్యక్రమాలు ప్రారంభించాలి. ప్రతి వక్త తమ అంశాన్ని సంక్షిప్తంగా చెప్పాలి’’ అని చంద్రబాబు సూచించారు. ఈ మహానాడులో ప్రవేశపెట్టే 19 తీర్మానాలకు పొలిట్బ్యూరో ఆమోదం తెలిపింది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!