
జనరల్

రామ్ చరణ్ హీరోగా దర్శకుడు బుచ్చిబాబు తెరకెక్కిస్తున్న ‘పెద్ది’ చిత్రం జూన్ 4న ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రచార కార్యక్రమాల్లో భాగంగా రామ్ చరణ్, బుచ్చిబాబు కలిసి కారులో ప్రయాణిస్తూ ప్రత్యేక సంభాషణ నిర్వహించారు. ఈ సందర్భంగా దర్శకుడు “మీకు అత్యంత ఇష్టమైన ఘట్టం ఏది?” అని ప్రశ్నించగా రామ్ చరణ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
సినిమాలో దిల్లీ ఘట్టం తనకు అత్యంత ఇష్టమని రామ్ చరణ్ తెలిపారు. ‘పెద్ది’ చిత్రంలో అత్యధిక మలుపులు ఉన్న భాగం అదే అని చెప్పారు. ‘ఉప్పెన’ చిత్రంలోని మలుపుల కంటే వంద రెట్లు ఎక్కువ ఆశ్చర్యం కలిగించే విధంగా ఆ ఘట్టం ఉంటుందని పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!