
జనరల్

ఈ నెల 23 సాయంత్రం 3 గంటలకు తెలుగు ఫిలిం ఛాంబర్లోని నిర్మాతల మండలి హాల్లో తెలంగాణ థియేటర్ యజమానులు కీలక సమావేశం నిర్వహించనున్నారు. పర్సంటేజ్ సిస్టమ్ వివాదంపై ఎగ్జిబిటర్లు ఈ భేటీలో కీలక నిర్ణయం తీసుకోనున్నారు.
థియేటర్ యజమానులు, నిర్మాతల మధ్య కొనసాగుతున్న పర్సంటేజ్ సిస్టమ్ వివాదం టాలీవుడ్లో తీవ్ర ప్రతిష్ఠంభనకు దారితీసింది. ఈ సమావేశంలో భవిష్యత్తు కార్యాచరణపై స్పష్టత రానుందని భావిస్తున్నారు. థియేటర్ల బంద్ దిశగా అడుగులు పడతాయా? అనే ఉత్కంఠ పరిశ్రమ వర్గాల్లో నెలకొంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!