

రుణాల వసూళ్ల పేరుతో కస్టమర్లను వేధిస్తున్న బ్యాంకులు, రికవరీ ఏజెంట్లపై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) కఠిన చర్యలకు సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో ‘కండక్ట్ ఆఫ్ రెగ్యులేటెడ్ ఎంటిటీస్ ఇన్ రికవరీ ఆఫ్ లోన్స్ అండ్ ఎంగేజ్ మెంట్ ఆఫ్ రికవరీ ఏజెంట్స్’ పేరుతో కొత్త ముసాయిదా నిబంధనలను ఆర్బీఐ విడుదల చేసింది. మే 31 వరకు ప్రజలు, వాటాదారుల అభిప్రాయాలను స్వీకరించనున్న ఆర్బీఐ.. అక్టోబర్ 1 నుంచి ఈ నిబంధనలను అమలు చేయాలని భావిస్తోంది.
వ్యక్తిగత, కారు, హోమ్ లోన్లు చెల్లించని సందర్భాల్లో బ్యాంకులు కస్టమర్ల మొబైల్ ఫోన్లను లాక్ చేయడం లేదా ఫీచర్లు నిలిపివేయడం చేయకూడదని ఆర్బీఐ స్పష్టం చేసింది. అయితే అదే బ్యాంక్ ఫోన్ కొనుగోలుకు లోన్ ఇచ్చి, 90 రోజులకుపైగా బకాయి ఉంటే మాత్రమే పరిమిత చర్యలు తీసుకోవచ్చని తెలిపింది. ఫోన్ బ్లాక్ చేసినా ఇంటర్నెట్, ఇన్కమింగ్ కాల్స్, ఎమర్జెన్సీ సేవలు నిలిపివేయకూడదని పేర్కొంది. అలాగే రికవరీ ఏజెంట్లు అసభ్య పదజాలం, బెదిరింపులు, సోషల్ మీడియాలో అవమానకర పోస్టులు చేయడం పూర్తిగా నిషేధించాలని ప్రతిపాదించింది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!