

వెనెజువెలాలో జరిగిన రెండు భారీ భూకంపాలు అనేక కుటుంబాలను విషాదంలో ముంచాయి. ఇందులో అర్జెంటీనా ఫుట్బాల్ ఆటగాడు లుకాస్ ట్రెజో తన భార్య, ఇద్దరు పిల్లలను కోల్పోయాడు. వారు ఉంటున్న భవనం భూకంప సమయంలో కూలిపోవడంతో శిథిలాల కింద చిక్కుకుని ప్రాణాలు కోల్పోయారు. ఈ విషయాన్ని అతని ఫుట్బాల్ క్లబ్ ‘డిపోర్టివో లా గువేరా’ ధృవీకరించింది. ప్రమాద సమయంలో ట్రెజో తన జట్టుతో వేరే ప్రాంతంలో ఉండటంతో ప్రాణాలతో బయటపడ్డాడు. వార్త తెలిసిన వెంటనే అతను సంఘటనా స్థలానికి చేరుకుని శిథిలాల్లో తన కుటుంబాన్ని వెతికిన దృశ్యం భావోద్వేగంగా మారింది.
ఈ భూకంపాలు యారకూయ్ ప్రాంతాన్ని తీవ్రంగా ప్రభావితం చేసి, అనేక భవనాలు కూలిపోయాయి. 6 మిలియన్లకు పైగా ప్రజలు ప్రభావితమయ్యారని సమాచారం. ఇప్పటివరకు 1,400 మందికి పైగా మృతదేహాలు లభించగా, వేలాది మంది గల్లంతయ్యారు. బ్రెజిల్ ఫుట్బాల్ స్టార్ నెయ్మర్ సహాయక చర్యల కోసం 2.5 లక్షల డాలర్లు విరాళంగా ప్రకటించాడు. ఈ విపత్తు తీర ప్రాంతాలను పూర్తిగా ధ్వంసం చేసి, హోటళ్లు, మౌలిక వసతులు కూలిపోవడంతో భారీ నష్టం కలిగించింది.

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!