

కన్నడ ‘సుప్రీమ్ స్టార్’ భార్గవ్ హీరోగా, దర్శకుడిగా తెలుగు-కన్నడ ద్విభాషా చిత్రం ‘తొలిసారి మిమ్మల్ని చూసింది మొదలు’ తెరకెక్కుతోంది. కోసల క్రియేటివ్ వర్క్స్ ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్పై బండి నాగరాజు నిర్మిస్తున్న ఈ చిత్రానికి మద్దినేని రమేష్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్గా వ్యవహరిస్తున్నారు. మీనాక్షి జైస్వాల్, ఆరియా మీనన్ కథానాయికలుగా నటిస్తున్నారు. గ్రామీణ నేపథ్యంలో సాగే ఎమోషనల్ థ్రిల్లర్గా రూపొందుతున్న ఈ సినిమా హైదరాబాద్లో సంప్రదాయ పూజా కార్యక్రమంతో ఘనంగా ప్రారంభమైంది.

సెప్టెంబర్ మొదటి వారంలో బెంగళూరు సమీపంలోని ఓ గ్రామంలో షూటింగ్ ప్రారంభించి, రెండు షెడ్యూళ్లలో చిత్రీకరణ పూర్తి చేసి అక్టోబర్ నాటికి షూటింగ్ ముగించాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. సంగీత దర్శకుడు పెద్దపల్లి రోహిత్ నాలుగు పాటలకు సంగీతం అందిస్తున్నారు. బలమైన కథ, భావోద్వేగాలు, ఉత్కంఠభరిత సన్నివేశాలతో పాటు కమర్షియల్ అంశాలను మేళవించి సినిమాను రూపొందిస్తున్నట్లు హీరో, దర్శకుడు భార్గవ్ తెలిపారు. తెలుగు, కన్నడ ప్రేక్షకులకు ఈ చిత్రం మంచి అనుభూతిని అందిస్తుందని చిత్ర బృందం నమ్మకం వ్యక్తం చేసింది.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!