
జనరల్

కేంద్ర హోం శాఖ పరిధిలోని రిజిస్ట్రార్ జనరల్ ఆఫ్ ఇండియా జనగణన 2027లో భాగంగా నిర్వహించనున్న ఇంటింటి సర్వేకు సంబంధించిన ప్రశ్నావళిని నోటిఫై చేసింది. మొత్తం 40 ప్రశ్నలతో ఈ సర్వే నిర్వహించి కుటుంబాలు, కుటుంబ సభ్యులకు సంబంధించిన వివిధ వివరాలను సేకరించనున్నారు.
ఈ ప్రశ్నావళిలో కుటుంబ సభ్యుల ఆధార్, మొబైల్ నంబర్లు, బ్యాంకు ఖాతాల వివరాలు, పని ప్రదేశానికి వెళ్లే విధానం, మతం, కులం తదితర అంశాలపై సమాచారం అడగనున్నారు. సేకరించిన వివరాలను పక్కాగా నమోదు చేసి అధికారిక జనాభా, కుటుంబ గణాంకాలను రూపొందించనున్నారు. ఈ మేరకు శుక్రవారం భారత ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!