
జనరల్

కర్నూలులో శాంతిభద్రతల పరిస్థితిపై మంత్రి భరత్ సంచలన వ్యాఖ్యలు చేశారు. జిల్లాలో రౌడీలు రెచ్చిపోతున్నారని, హత్యలకు తెగబడుతున్నారని ఆరోపించారు. ఇంతియాజ్ హత్యకు సంబంధించిన విషయం వారం రోజుల ముందే సోషల్ మీడియాలో వచ్చినప్పటికీ, ఈ ఘటనను పోలీసులు ఎందుకు గుర్తించలేకపోయారని ఆయన ప్రశ్నించారు.
మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర రాజకీయ నేతలపై నేరగాళ్లు నిఘా పెడుతున్నారనే అనుమానాలు వ్యక్తం చేసిన మంత్రి భరత్. పోలీసులు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. ఇటీవల జరిగిన హత్యల వెనుక వైసీపీ హస్తం ఉందని ఆయన ఆరోపించారు. అయితే ఇవి మంత్రి చేసిన రాజకీయ ఆరోపణలు మాత్రమేనని, దర్యాప్తులో వాస్తవాలు తేలాల్సి ఉంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!