
జనరల్

అమరావతిలో నేడు పలు కీలక అభివృద్ధి ప్రాజెక్టులు ప్రారంభం కానున్నాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా వివిధ మౌలిక వసతుల పనులను ప్రజలకు అంకితం చేయనున్నారు. ఉండవల్లి సమీపంలో నిర్మించిన స్టీల్ బ్రిడ్జిని సీఎం ప్రారంభించనుండగా, సీడ్ యాక్సిస్ రోడ్డును కూడా ప్రజలకు అందుబాటులోకి తీసుకురానున్నారు.
అదే సమయంలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల హౌసింగ్ ప్రాజెక్టును సీఆర్డీఏ అధికారులు సాధారణ పరిపాలన శాఖకు అప్పగించనున్నారు. అమరావతి మౌలిక వసతుల అభివృద్ధిలో ఈ ప్రాజెక్టుల ప్రారంభం కీలక ముందడుగుగా ప్రభుత్వం పేర్కొంటోంది. రహదారులు, వంతెనలు, నివాస సదుపాయాల అభివృద్ధితో రాజధాని ప్రాంతంలో నిర్మాణ పనులకు మరింత ఊపం రానుందని అధికారులు భావిస్తున్నారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!