

హనీ ట్రాప్, చీటింగ్ కేసులో సినీ నటి అషు రెడ్డి తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. పోలీసులు ఏకపక్షంగా వ్యవహరించారని ఆరోపిస్తూ ఆమె క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. లండన్కు చెందిన సాఫ్ట్వేర్ ఇంజనీర్ ధర్మేంద్ర చేసిన ఆరోపణలు అసత్యమని, తన ప్రతిష్ఠను దెబ్బతీసేందుకు ప్రయత్నిస్తున్నారని ఆమె పేర్కొన్నారు. తన వివరణ తీసుకోకుండానే, ధర్మేంద్ర తండ్రి ఫిర్యాదు ఆధారంగా ఎఫ్ఐఆర్ నమోదు చేయడం అన్యాయమని ఆవేదన వ్యక్తం చేశారు.
సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తూ తన వ్యక్తిత్వాన్ని దెబ్బతీస్తున్నారని కూడా ఆమె ఆరోపించారు. మరోవైపు, 2018 నుంచి పెళ్లి చేస్తానని నమ్మించి రూ.9.35 కోట్లు, 5 కిలోల బంగారం, లగ్జరీ కార్లు, ఫ్లాట్లు తీసుకున్నారని ధర్మేంద్ర కుటుంబం సీసీఎస్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ కేసు ప్రస్తుతం న్యాయపరమైన విచారణలో ఉండగా, హైకోర్టు తీర్పు కోసం అందరూ ఎదురుచూస్తున్నారు.












కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!