
సినిమాలు

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (వైసీపీ) నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు ఆంధ్రప్రదేశ్ డీఎస్సీ నియామకాలపై తీవ్ర ఆరోపణలు చేశారు. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ స్పోర్ట్స్ కోటా నియామకాలలో అక్రమాలకు పాల్పడ్డారని ఆయన ఆరోపించారు. స్పోర్ట్స్ కోటా ఉద్యోగాలను తనకు అనుకూలంగా ఉన్న వారికి కేటాయించేందుకు నిబంధనలను మార్చారని విమర్శించారు.
జనరల్ స్పోర్ట్స్ కోటా 2 శాతం ఉండాల్సి ఉండగా దానిని 3 శాతానికి పెంచారని, ఇందుకోసం పాత జీవోను రద్దు చేసి కొత్త జీవో జారీ చేశారని అంబటి రాంబాబు ఆరోపించారు. అలాగే స్పోర్ట్స్ కోటా అభ్యర్థులు డీఎస్సీ పరీక్షకు హాజరుకావాల్సిన అవసరం లేదని జీవోలో మార్పులు చేశారని, నియామకాలు పూర్తయ్యాక మళ్లీ పాత జీవోను అమల్లోకి తీసుకువచ్చారని పేర్కొన్నారు. ఈ ఆరోపణలపై ప్రభుత్వం నుంచి అధికారిక స్పందన రావాల్సి ఉంది.

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!