
సినిమాలు

తెలంగాణ ప్రభుత్వం సనత్నగర్లోని తెలంగాణ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (టిమ్స్)కు మాజీ ముఖ్యమంత్రి డా. మర్రి చెన్నారెడ్డి పేరును ఖరారు చేసింది. ఈ మేరకు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుని అధికారికంగా ప్రకటించింది. రాష్ట్ర ఆరోగ్య రంగంలో సంస్థలకు ప్రముఖుల పేర్లు ఇవ్వాలనే ప్రభుత్వ నిర్ణయంలో భాగంగా ఈ చర్య చేపట్టినట్లు తెలుస్తోంది.
అదేవిధంగా, సనత్నగర్ టిమ్స్కు ఇన్ఛార్జ్ డైరెక్టర్గా నరేంద్ర కుమార్ను తెలంగాణ ప్రభుత్వం నియమించింది. ఆస్పత్రి పరిపాలనను మరింత సమర్థవంతంగా నిర్వహించడం, వైద్య సేవలను బలోపేతం చేయడం లక్ష్యంగా ఈ నియామకం చేపట్టినట్లు అధికారులు తెలిపారు.

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!