
జనరల్

వి.సి. సజ్జనర్, హైదరాబాద్ పోలీస్ కమిషనర్, ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణ రెడ్డి కేసుపై స్పందిస్తూ దర్యాప్తు నిష్పక్షపాతంగా కొనసాగుతోందని తెలిపారు. ఏ స్థాయిలో ఉన్న పోలీస్ అధికారులైనా అక్రమ సంబంధాలు లేదా తప్పిదాలపై ఫిర్యాదులు వస్తే కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. జూబ్లీహిల్స్, మలక్పేట్, దోమలగూడ సర్కిల్ ఇన్స్పెక్టర్లపై వచ్చిన ఫిర్యాదుల మేరకు ఇప్పటికే సస్పెన్షన్ చర్యలు తీసుకున్నట్లు వెల్లడించారు.
బాధితులకు న్యాయం చేయడమే హైదరాబాద్ పోలీసుల లక్ష్యమని ఆయన తెలిపారు. ప్రత్యేక శాఖ ద్వారా విచారణ జరిపిస్తూ, ఆరోపణలు ఎదుర్కొంటున్న అధికారులపై చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. పోలీస్ శాఖకు మచ్చ తీసుకొచ్చే ఎవరినీ సహించబోమని, విధులను నిబద్ధతతో నిర్వహించాలని పోలీస్ సిబ్బందికి హెచ్చరికలు జారీ చేశారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!