

బెంగళూరులో 15వ స్ట్రాటజిక్ ఎలక్ట్రానిక్స్ సమ్మిట్ 2026 ప్రారంభమైంది. సాఫ్ట్వేర్, సెమీకండక్టర్ డిజైన్, అడ్వాన్స్డ్ ఇంజినీరింగ్, పరిశోధన రంగాల్లో కర్ణాటక ఇప్పటికే గ్లోబల్ గుర్తింపు సాధించింది. ఈ బలాన్ని ఉపయోగించుకుని స్ట్రాటజిక్ ఎలక్ట్రానిక్స్, రక్షణ తయారీ, ఏరోస్పేస్ రంగాల్లో మరింత అభివృద్ధి సాధిస్తూ దేశానికి సాంకేతిక స్వావలంబన దిశగా కర్ణాటక కీలక పాత్ర పోషిస్తోంది.
ప్రభుత్వం ప్రోగ్రెసివ్ విధానాలు, వరల్డ్ క్లాస్ మౌలిక సదుపాయాలు, నైపుణ్యమైన మానవ వనరులు, పరిశ్రమల భాగస్వామ్యంతో ఆవిష్కరణలకు అనుకూల వాతావరణాన్ని సృష్టించేందుకు కట్టుబడి ఉందని తెలిపింది. ప్రభుత్వం, పరిశ్రమలు, స్టార్టప్స్, ఎంఎస్ఎంఈలు, విద్యాసంస్థలు, సాయుధ దళాల మధ్య సహకారం పెంపొందించడం ద్వారా పరిశోధన వేగవంతం చేసి తయారీ సామర్థ్యాలను బలోపేతం చేయాలని సూచించింది. యువతకు అవకాశాలు సృష్టిస్తూ, సాంకేతికంగా అభివృద్ధి చెందిన భారత నిర్మాణంలో కర్ణాటక ముందంజలో నిలవనుంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!