

మ్యూచువల్ ఫండ్లలో కొత్తగా పెట్టుబడులు పెట్టాలని లేదా తమ పోర్ట్ఫోలియోను మరింత వైవిధ్యపరచాలని చూస్తున్న ఇన్వెస్టర్లకు ఈ వారం పలు అవకాశాలు అందుబాటులోకి వచ్చాయి. మొత్తం 12 న్యూ ఫండ్ ఆఫర్లు సబ్స్క్రిప్షన్ కోసం ప్రారంభమయ్యాయి. వీటిలో లైఫ్ సైకిల్, ఇండెక్స్, పాసివ్, మల్టీ క్యాప్, ఓవర్నైట్, థీమాటిక్, వాల్యూ ఫండ్ విభాగాలకు చెందిన పథకాలు ఉన్నాయి. ఎన్ఎఫ్ఓ సమయంలో యూనిట్ ధర సాధారణంగా రూ.10గా ఉంటుంది. కనీస పెట్టుబడి పథకాన్ని బట్టి రూ.100 నుంచి రూ.5,000 వరకు ఉంటుంది.
ఈ జాబితాలో ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ లైఫ్ సైకిల్ ఫండ్ 2031, 2036, 2041, జెరోధా లైఫ్ సైకిల్ ఫండ్ 2031 ఉన్నాయి. యూటీఐ బీఎస్ఈ ఇండియా సెక్టార్ లీడర్స్ ఇండెక్స్ ఫండ్, నావీ నిఫ్టీ ఆర్ఈఐటీఎస్ అండ్ రియాల్టీ ఇండెక్స్ ఫండ్, యూటీఐ బీఎస్ఈ ఇండియా సెక్టార్ లీడర్స్ ఈటీఎఫ్, ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ డైనమిక్ అసెట్ అలకేషన్ పాసివ్ ఫండ్ ఆఫ్ ఫండ్ కూడా అందుబాటులో ఉన్నాయి. వీటితో పాటు ది వెల్త్ కంపెనీ మల్టీ క్యాప్ ఫండ్, మోనార్క్ ఓవర్నైట్ ఫండ్, మోతీలాల్ ఓస్వాల్ క్వాలిటీ ఫండ్, బ్యాంక్ ఆఫ్ ఇండియా వాల్యూ ఫండ్ ఉన్నాయి. ఈ పథకాల సబ్స్క్రిప్షన్ గడువులు సెప్టెంబర్ 7 నుంచి 11 మధ్య ముగియనున్నాయి.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!