

రాబోయే ఏడాది కాలంలో హైదరాబాద్లో మరో 50–70 గ్లోబల్ కేపబిలిటీ సెంటర్లు (జీసీసీలు) ఏర్పాటయ్యే అవకాశం ఉందని ఫిక్కీ, ప్రాపర్టీ కన్సల్టెంట్ అనరాక్ సంయుక్తంగా రూపొందించిన నివేదిక వెల్లడించింది. ప్రస్తుతం నగరంలో సుమారు 515 జీసీసీలు ఉండగా, వీటిలో 3 లక్షల మందికి పైగా ఉద్యోగులు పనిచేస్తున్నారు. దేశవ్యాప్తంగా ఉన్న జీసీసీల్లో దాదాపు 20 శాతం హైదరాబాద్లోనే ఉన్నాయి.
నగర ఆఫీస్ మార్కెట్ డిమాండ్ను పెంచడంలో జీసీసీలు కీలక చోదక శక్తులుగా మారాయని నివేదిక పేర్కొంది. విదేశీ సంస్థలు ఏర్పాటు చేసిన జీసీసీలు 2021లో 19 లక్షల చదరపు అడుగుల కార్యాలయ స్థలాన్ని తీసుకోగా, 2025లో ఈ డిమాండ్ 45 లక్షల చదరపు అడుగులకు పెరిగింది. దీంతో హైదరాబాద్ వాణిజ్య రియల్ ఎస్టేట్ మార్కెట్కు జీసీసీలు మరింత ఊతమిస్తున్నాయి.
జీసీసీల విస్తరణతో హైదరాబాద్ కేవలం ఐటీ–ఐటీఈఎస్ రంగానికే పరిమితం కాకుండా ఇతర రంగాల్లోనూ తన పరిధిని విస్తరిస్తోందని ఫిక్కీ తెలంగాణ స్టేట్ కౌన్సిల్ చైర్మన్ వి.వి. రామ రాజు తెలిపారు. రాబోయే కాలంలో కొత్త జీసీసీల రాకతో నగరంలో కార్యాలయ స్థలాల డిమాండ్, ఉపాధి అవకాశాలు మరింత పెరిగే అవకాశం ఉంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!