

తిరుమలలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పర్యటన రెండో రోజు కొనసాగుతోంది. నేడు పలు అభివృద్ధి కార్యక్రమాలను ఆయన ప్రారంభించనున్నారు. భక్తులకు తిరుమల విశిష్టత, శ్రీవారి విశేషాలను పరిచయం చేసేందుకు టీటీడీ అందుబాటులోకి తీసుకొచ్చిన శ్రీ వేంకటేశ్వర మ్యూజియాన్ని సీఎం ప్రారంభించనున్నారు. నాలుగు అంతస్తులు, 14 గ్యాలరీలు, సుమారు లక్ష చదరపు అడుగుల విస్తీర్ణంలో ఏర్పాటు చేసిన ఈ మ్యూజియంలో 8,000కు పైగా ప్రదర్శనలను అందుబాటులోకి తీసుకొచ్చారు.
తిరుమలకు వచ్చే ప్రతి భక్తుడి భద్రతకు ప్రాధాన్యతనిస్తూ టీటీడీ, ఎల్ఐసీతో కలిసి గ్రూప్ ఇన్సూరెన్స్ పథకాన్ని తీసుకొచ్చింది. దర్శనం కోసం వేచి ఉండే భక్తుల కోసం తిరుమల హీలింగ్, డివోషన్ ఎక్స్పీరియన్స్ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. వైకుంఠం క్యూ కాంప్లెక్స్-1లో ఇమ్మెర్సివ్ థియేటర్తో పాటు లైవ్ మెడిటేషన్ ప్రసారం చేసేందుకు ఏర్పాట్లు చేశారు.
పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యతనిస్తూ 32 కొత్త ఎలక్ట్రిక్ బస్సులను టీటీడీ అందుబాటులోకి తీసుకురానుంది. ఇందులో రిలయన్స్ 25 బస్సులు, భారత్ బయోటెక్ 7 బస్సులను టీటీడీకి అందజేశాయి. యాత్రికుల వసతి గదులకు సంబంధించిన సేవలను మరింత సులభతరం చేసేందుకు ‘నందకం’ యాప్ను కూడా సీఎం చంద్రబాబు లాంఛ్ చేయనున్నారు.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!