

టర్కీ రక్షణ రంగంలో మరో కీలక ముందడుగు వేసింది. బైరాక్తార్ డ్రోన్లను తయారు చేసే బైకార్ సంస్థ, ఇప్పుడు తన తొలి మానవరహిత ఫైటర్ జెట్ ‘కిజిలెల్మా’ ను అభివృద్ధి చేసింది. పూర్తిగా టర్కీ స్వదేశీ సాంకేతికతతో రూపొందించిన ఈ యుద్ధ విమానం, టెస్ట్ షెడ్యూల్లో భాగంగా ఏరోడైనమిక్ సిస్టమ్ ఐడెంటిఫికేషన్ పరీక్షను విజయవంతంగా పూర్తి చేసింది.
టర్కీ డ్రోన్ల ను పాకిస్తాన్, బంగ్లాదేశ్ ఇప్పటి కే కొనుగోలు చేశాయి. బంగ్లాదేశ్ ఈ డ్రోన్ల ను భారత సరిహద్దు ప్రాంతాల్లో మోహరించడం, భారత్ కు వ్యూహాత్మకంగా ఆందోళన కలిగించే అంశంగా మారింది. భారత వ్యతిరేక దేశాలతో టర్కీకి ఉన్న సన్నిహిత సంబంధాలు కూడా భారత్ దృష్టిలో ఆందోళనకర అంశమే. ఈ నేపథ్యంలో భారత్ కూడా తన స్వంత డ్రోన్ యుద్ధవాహనాల అభివృద్ధిని వేగవంతంగా కొనసాగిస్తోంది.
శక్తివంతమైన కొత్త ఇంజన్ వల్ల ధ్వని వేగానికి సమీపంగా ప్రయాణించగలదు.
అధిక వేగంతో క్లిష్టమైన వైమానిక విన్యాసాలు చేయగల సామర్థ్యం ఉంది.
ఆధునిక AESA రాడార్ అమర్చడం వల్ల టార్గెట్ ట్రాకింగ్ సామర్థ్యం పెరిగింది.
AI ఆధారిత సిస్టమ్స్ ఉండటం వల్ల స్వయంచాలకంగా టేకాఫ్, ల్యాండింగ్ చేయగలదు.
స్టెల్త్ డిజైన్ కారణంగా రాడార్ వ్యవస్థలకు కనిపించడం కష్టం.
2023 లో బైకార్ 1.8 బిలియన్ డాలర్ల ఎగుమతి ఆదాయం సాధించింది.
ప్రస్తుతం ఇది ప్రపంచంలోనే అతిపెద్ద UAV ఎగుమతిదారు.
బైరాక్తార్ TB2 UCAV కోసం 34 దేశాలు ఒప్పందాలు చేసుకున్నాయి.
బైరాక్తార్ ఆకిన్సీ డ్రోన్లను 11 దేశాలు కొనుగోలు చేశాయి.
సమీపంలో బైకార్, ఇటలీకి చెందిన లియోనార్డో సంస్థతో వ్యూహాత్మక సహకార ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ఒప్పందం కారణంగా బైకార్ యూరోపియన్ మార్కెట్లోకి మరింత వేగంగా విస్తరించే అవకాశం ఉంది.















కామెంట్స్ (2)
టర్కీ రక్షణ రంగం దూసుకుపోయే వేగం నిజంగా గమనించాల్సిందే
Powerful jet!