

అంతరిక్షం అపారమైనది, మానవ ఊహకు అందనంత విస్తారమైనది. ఇప్పటివరకు ఖగోళ శాస్త్రవేత్తలు వేలాది సౌర వ్యవస్థల్లో వేలాది గ్రహాలను గుర్తించారు. భూమికి అత్యంత సమీప నక్షత్రం అయిన ప్రోక్సిమా సెంటౌరి కూడా సుమారు 4.3 కాంతి సంవత్సరాల దూరంలో ఉంది. ప్రస్తుత సాంకేతిక పరిజ్ఞానంతో ప్రయాణించే అత్యంత వేగవంతమైన అంతరిక్ష నౌకలు కూడా ఆ దూరాన్ని చేరుకోవడానికి వేల సంవత్సరాలు పడుతుంది. అందువల్ల మానవ జీవితకాలంలో ఇతర నక్షత్ర వ్యవస్థలకు చేరుకోవడం ఇప్పటికీ ఒక పెద్ద సవాలుగానే ఉంది.
శాస్త్రవేత్తల ప్రకారం కాంతి వేగానికి సమీపంగా ప్రయాణించినప్పుడు ‘టైమ్ డైలేషన్’ అనే ప్రభావం కనిపిస్తుంది. అంటే ప్రయాణికులకు కాలం నెమ్మదిగా గడుస్తుంది. అంతేకాకుండా అంతరిక్ష నౌక వేగం పెరిగే కొద్దీ దాని ద్రవ్యరాశి కూడా పెరుగుతుంది. దీంతో మరింత శక్తి అవసరం అవుతుంది. కాంతి వేగాన్ని చేరుకోవడానికి అనంతమైన శక్తి అవసరమవుతుందని ఐన్స్టీన్ సిద్ధాంతాలు చెబుతున్నాయి. అలాగే అంతరిక్షంలోని సూక్ష్మ కణాలు కూడా అధిక వేగంతో ప్రయాణించే నౌకలకు ప్రమాదంగా మారే అవకాశం ఉంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!