
జనరల్

భారతదేశంలో విద్యుత్తు ఆధారిత వాహనాల (ఈవీ) రంగం రాబోయే సంవత్సరాల్లో భారీ స్థాయిలో ఉపాధి అవకాశాలను కల్పించే రంగంగా ఎదగనున్నట్లు అడెకో ఇండియా విడుదల చేసిన తాజా నివేదిక పేర్కొంది. 2030 నాటికి ఈ రంగంలో 3 నుంచి 4 కోట్ల ఉద్యోగాలు సృష్టించే అవకాశం ఉందని, ఏటా నియామకాలు 15–20 శాతం వృద్ధి చెందవచ్చని అంచనా వేసింది. ముఖ్యంగా ఇంజినీరింగ్, బ్యాటరీ టెక్నాలజీ, ఎనర్జీ సిస్టమ్స్ నిపుణులకు అధిక డిమాండ్ ఉంటుందని వెల్లడించింది.
దేశంలో టూవీలర్లు, ప్యాసింజర్ వాహనాలు, తేలికపాటి వాణిజ్య వాహనాలు, ప్రజా రవాణాలో ఈవీల వినియోగం వేగంగా పెరుగుతుండటమే ఈ వృద్ధికి ప్రధాన కారణమని నివేదిక తెలిపింది. మొత్తం ఉద్యోగాల్లో సుమారు 15 శాతం ప్రత్యక్షంగా, మిగిలిన 85 శాతం తయారీ, సరఫరా వ్యవస్థలు, మౌలిక సదుపాయాలు మరియు అనుబంధ రంగాల ద్వారా పరోక్షంగా ఏర్పడనున్నాయని పేర్కొంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!