
జనరల్

రాష్ట్ర ప్రభుత్వం చేనేత కార్మికుల సంక్షేమానికి మరొక కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే ఉచిత విద్యుత్, రాయితీలు, 50 ఏళ్లకే పింఛన్ అందిస్తూ అండగా నిలుస్తున్న ప్రభుత్వం, ఇప్పుడు ‘నేతన్న సేవలో’ పథకాన్ని ప్రారంభిస్తోంది. ఈ పథకం కింద ప్రతి అర్హత కలిగిన చేనేత కుటుంబానికి రూ.25 వేల ఆర్థిక సాయం అందించనుంది. ఆగస్ట్ 7న జరగనున్న 12వ జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ పథకాన్ని ప్రారంభించనున్నారు.
ఈ పథకం ద్వారా రాష్ట్రవ్యాప్తంగా 71,536 చేనేత కుటుంబాలకు రూ.179 కోట్లు పంపిణీ చేయనున్నారు. మేనిఫెస్టోలో హామీ లేకపోయినా, చేనేతల సంక్షేమం, వారి వృత్తి పరిరక్షణ కోసం ప్రభుత్వం ముందడుగు వేసింది. మరోవైపు, ముఖ్యమంత్రి రేపు చీరాల నియోజకవర్గంలో పర్యటించి, కొత్తపేటలో సభలో పాల్గొని, జాండ్రపేటలో చేనేతలతో ముఖాముఖి నిర్వహించనున్నారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!