
రాజకీయాలు

భారత యువ క్రికెట్ సంచలనం వైభవ్ సూర్యవంశీ ఐపీఎల్ 2026లో అద్భుత ప్రదర్శనతో అంతర్జాతీయ స్థాయిలో భారీ గుర్తింపు సంపాదించాడు. ఆ ప్రదర్శనల తర్వాత ఆయన శ్రీలంకలో జరగనున్న భారత్-ఏ ట్రై సిరీస్ సిరీస్కు ఎంపికయ్యాడు. ఈ సిరీస్లో శ్రీలంక, ఆఫ్ఘనిస్తాన్-ఏ, భారత్-ఏ జట్లు పాల్గొననున్నాయి. పోటీలు జూన్ 9 నుంచి జూన్ 21 వరకు డంబుల్లాలో జరుగనున్నాయి.
తిలక్ వర్మ నాయకత్వంలో భారత్-ఏ జట్టు బరిలోకి దిగనుండగా, జట్టులో వైభవ్ సూర్యవంశీ ప్రధాన ఆకర్షణగా నిలిచాడు. గాయంతో బాధపడుతున్న రియాన్ పరాగ్ స్థానంలో రుతురాజ్ గైక్వాడ్ను ఎంపిక చేశారు. అన్ని మ్యాచ్లను సోనీ నెట్వర్క్ ప్రత్యక్ష ప్రసారం చేయనుంది. వైభవ్ క్రేజ్ కారణంగా ఈ సిరీస్కు భారీ ఆదరణ లభిస్తోంది.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!