

రాబోయే గోదావరి పుష్కరాలను దృష్టిలో ఉంచుకుని తూర్పు గోదావరి జిల్లా మునికూడలిని మోడల్ పుష్కర్ పంచాయతీగా తీర్చిదిద్దుతున్న అభివృద్ధి పనులపై ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సమీక్ష నిర్వహించారు. సుమారు రూ.7 కోట్ల వ్యయంతో సప్త ఋషి ఘాట్ అభివృద్ధి, గ్రామం నుంచి ఘాట్ వరకు సీసీ రోడ్డు, హైమాస్ట్ లైటింగ్, మ్యాజిక్ డ్రెయిన్లు, ఇంకుడు గుంతలు, ఆధునిక సమాచార కేంద్రం, ప్రజా మరుగుదొడ్లు వంటి మౌలిక సదుపాయాలు వేగంగా నిర్మిస్తున్నారు.
“స్వచ్ఛ గోదావరి – పవిత్ర పుష్కరాలు” అనే లక్ష్యంతో పర్యావరణహిత, జీరో లిక్విడ్ డిశ్చార్జ్ ప్రమాణాలకు అనుగుణంగా గ్రామాన్ని అభివృద్ధి చేస్తున్నారు. సమీక్షలో అధికారులు పలు పనులు తుది దశకు చేరుకున్నాయని, మిగిలినవి శరవేగంగా కొనసాగుతున్నాయని వివరించారు. పుష్కరాలకు వచ్చే లక్షలాది మంది భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని పనులను త్వరగా పూర్తి చేయాలని పవన్ కళ్యాణ్ అధికారులను ఆదేశించారు.












కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!