
జనరల్

దేశంలోని ప్రతి జిల్లా ప్రత్యేకతను ప్రపంచానికి పరిచయం చేయాలనే లక్ష్యంతో ప్రారంభించిన ‘జెమ్స్ ఆఫ్ ఇండియా ఛాలెంజ్’ కార్యక్రమాన్ని దేశవ్యాప్తంగా విస్తరించేందుకు కేంద్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. పైలట్ దశలో వచ్చిన అనుభవాలను ఆధారంగా తీసుకుని ప్రతి జిల్లా చరిత్ర, సంస్కృతి, సంప్రదాయాలు, పర్యాటక ఆకర్షణలను డిజిటల్ కంటెంట్ ద్వారా ప్రజలకు చేరవేయాలని ప్రభుత్వం భావిస్తోంది.
ఈ కార్యక్రమాన్ని దశలవారీగా అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు విస్తరించనున్నట్లు అధికారులు తెలిపారు. దేశవ్యాప్తంగా డిజిటల్ కంటెంట్ సృష్టికర్తల బలమైన నెట్వర్క్ను ఏర్పాటు చేసి, భారతదేశంలోని ప్రతి ప్రాంత వైవిధ్యం, వారసత్వ సంపద, పర్యాటక అవకాశాలను దేశీయ, అంతర్జాతీయ స్థాయిలో విస్తృతంగా ప్రచారం చేయడమే ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశంగా పేర్కొన్నారు.












కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!