
జనరల్

భారత మాజీ ఆల్రౌండర్ యువరాజ్ సింగ్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ భవిష్యత్తుపై కొనసాగుతున్న ఊహాగానాలకు ముగింపు పలకాలని బీసీసీఐ, టీమ్ మేనేజ్మెంట్కు సూచించారు. 2027 వన్డే ప్రపంచకప్ ప్రణాళికల్లో ఈ ఇద్దరు సీనియర్ ఆటగాళ్లు ఉన్నారా? లేదా? అనే విషయాన్ని స్పష్టంగా తెలియజేయాలని ఆయన అభిప్రాయపడ్డారు. ఇప్పటికే టీ20, టెస్టు ఫార్మాట్లకు వీడ్కోలు పలికిన రోహిత్, కోహ్లీ ప్రస్తుతం వన్డే క్రికెట్పైనే దృష్టి సారించారు.
తాను కూడా ఇలాంటి పరిస్థితిని ఎదుర్కొన్నానని గుర్తుచేసుకున్న యువరాజ్, ఒకవేళ రోహిత్, కోహ్లీపై బీసీసీఐకి నమ్మకం ఉంటే వారికి పూర్తి మద్దతు ఇవ్వాలని అన్నారు. మరోవైపు, జట్టు ప్రణాళికల్లో వారు లేకపోతే అదే విషయాన్ని నిజాయితీగా ముఖాముఖిగా చెప్పాలని సూచించారు. స్పష్టమైన సమాచారం ఇవ్వడం ఆటగాళ్ల పట్ల గౌరవాన్ని చూపించే ఉత్తమ మార్గమని ఆయన పేర్కొన్నారు.
















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!