
జనరల్

న్యూఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోదీ నివాసం సమీపంలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ నేతృత్వంలో చేపట్టిన ధర్నాను పోలీసులు భగ్నం చేశారు. దాదాపు మూడున్నర గంటలపాటు కొనసాగిన నిరసన అనంతరం రాహుల్ గాంధీతో పాటు పలువురు కాంగ్రెస్ నేతలను పోలీసులు అదుపులోకి తీసుకుని అక్కడి నుంచి తరలించారు.
నేతలను తరలించే సమయంలో కాంగ్రెస్ నాయకులు, పోలీసుల మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకోవడంతో ప్రాంతంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చేందుకు భారీగా భద్రతా బలగాలను మోహరించిన పోలీసులు, ప్రధానమంత్రి నివాసం పరిసరాల్లో కట్టుదిట్టమైన భద్రతను కొనసాగించారు.












కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!