

స్వదేశంలో జరుగుతున్న సిరీస్ల్లో టీమిండియా పరాజయాల నేపథ్యంలో హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్పై విమర్శలు పెరుగుతున్నాయి. ఈ క్రమంలో సీనియర్ క్రికెటర్ అజింక్య రహానే స్పందిస్తూ, జట్టులో అతిగా ప్రయోగాలు చేయడమే ఓటములకు ప్రధాన కారణమని పరోక్షంగా వ్యాఖ్యానించాడు. చివరి తొమ్మిది వన్డేల్లో ఐదు మ్యాచ్ల్లో భారత్ ఓడిపోయిందని, ప్రపంచకప్ లక్ష్యంగా ముందుకు వెళ్తున్న సమయంలో ఆటగాళ్లకు స్పష్టత, భరోసా అవసరమని రహానే అన్నారు.
న్యూజిలాండ్తో స్వదేశంలో జరిగిన వన్డే సిరీస్లో భారత్ 0-3 తో ఓడిపోవడం అభిమానులను నిరాశపరిచిందని రహానే తెలిపారు. అయితే ఈ సిరీస్లో న్యూజిలాండ్ అన్ని విభాగాల్లో మెరుగ్గా ఆడిందని ఆయన అంగీకరించారు. ఇప్పుడు జరిగిన తప్పులను సమీక్షించుకుని, మళ్లీ పునరావృతం కాకుండా మేనేజ్మెంట్, కోచ్లు బాధ్యత తీసుకోవాలని సూచించారు. భారత్కు తదుపరి వన్డే సిరీస్కు ఇంకా ఆరు నెలల సమయం ఉందని, ఆలోగా సరైన ప్రణాళిక రూపొందించాల్సిన అవసరం ఉందన్నారు.











కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!