

భారత్, శ్రీలంక మధ్య జరుగుతున్న రెండో టెస్టులో మూడో రోజు ఆట వర్షం కారణంగా ముందుగానే ముగిసింది. 83.4 ఓవర్ల వద్ద వర్షం రావడంతో ఆట నిలిచిపోయింది. దీంతో శ్రీలంక 265/8 పరుగులతో రోజు ఆటను ముగించింది. క్రీజులో సోనల్ దినుషా 85, లాహిరు 8 పరుగులతో ఉన్నారు. భారత బౌలర్లలో ప్రసిద్ధ్ కృష్ణ, మానవ్ సుతార్ చెరో మూడు వికెట్లు పడగొట్టగా, మహ్మద్ సిరాజ్, రవీంద్ర జడేజా తలో వికెట్ తీశారు. భారత్ తొలి ఇన్నింగ్స్లో 503/9 వద్ద డిక్లేర్ చేయగా, శ్రీలంక ఇంకా 238 పరుగుల వెనుకంజలో ఉంది.

అంతకుముందు శ్రీలంక 8/2తో మూడో రోజు ఆటను ప్రారంభించింది. ప్రసిద్ధ్, మానవ్ బౌలింగ్లో వరుసగా వికెట్లు కోల్పోయిన ఆతిథ్య జట్టు అనంతరం సోనల్ దినుషా, పసిందు సూర్యబండార తదితరుల భాగస్వామ్యాలతో ఇన్నింగ్స్ను నిలబెట్టుకుంది. పసిందు 80 పరుగులు చేసి జడేజా బౌలింగ్లో ఔటవగా, డిక్వెలా డకౌట్ అయ్యాడు. సోనల్ అద్భుతంగా పోరాడుతూ అర్ధశతకం దాటి 85 పరుగులతో నాటౌట్గా నిలిచాడు. వర్షం కారణంగా చివర్లో ఆట కొనసాగించే అవకాశం లేకపోవడంతో అంపైర్లు మూడో రోజు ఆటను ముగించారు.

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!