

హైదరాబాద్లోని కమాండ్ కంట్రోల్ సెంటర్లో ప్రైవేట్ జూనియర్ కాలేజీల యాజమాన్యాలతో తెలంగాణ ఇంటర్మీడియట్ విద్యా మండలి, హైడ్రా అధికారులు కీలక సమావేశం నిర్వహించారు. హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్, తెలంగాణ ఇంటర్మీడియట్ విద్యా మండలి కార్యదర్శి అభిలాష అభినవ్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో తెలంగాణ ప్రైవేట్ జూనియర్ కాలేజీల యాజమాన్యాల సంఘం ప్రతినిధులు పాల్గొన్నారు. కాలేజీల్లో విద్యార్థుల భద్రతకు తీసుకోవాల్సిన చర్యలపై అధికారులు యాజమాన్యాలతో విస్తృతంగా చర్చించారు.
ముఖ్యంగా విద్యాసంస్థల్లో అగ్ని ప్రమాదాల నివారణ, అగ్నిమాపక భద్రతా మార్గదర్శకాల అమలు, అత్యవసర పరిస్థితుల్లో విద్యార్థులను సురక్షితంగా బయటకు తరలించే ఏర్పాట్లపై సమావేశంలో చర్చించారు. విద్యార్థుల భద్రతకు అత్యంత ప్రాధాన్యం ఇస్తూ, భద్రతా ప్రమాణాలను పకడ్బందీగా అమలు చేయాలని అధికారులు సూచించారు. ప్రైవేట్ జూనియర్ కాలేజీల్లో భద్రతా ఏర్పాట్లను మరింత బలోపేతం చేసే దిశగా ఈ సమావేశం కీలకంగా నిలిచింది.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!