
సినిమాలు

భారత్-ఆఫ్ఘనిస్తాన్ మధ్య రేపటి నుంచి టెస్టు సిరీస్ ప్రారంభం కానుండగా, ఆ తర్వాత మూడు వన్డేల సిరీస్ జరగనుంది. గాయం కారణంగా విరాట్ కోహ్లీ వన్డే సిరీస్కు దూరమయ్యే అవకాశం ఉందని కథనాలు వెలువడుతున్నాయి. కోహ్లీ అందుబాటులో లేకపోతే అతని స్థానంలో రుతురాజ్ గైక్వాడ్ను ఎంపిక చేసే అవకాశాలు ఉన్నట్లు సమాచారం.
సంజు శాంసన్, సాయి సుదర్శన్ పేర్లు పరిశీలనలో ఉన్నప్పటికీ ప్రధాన శిక్షకుడు గౌతమ్ గంభీర్ రుతురాజ్ గైక్వాడ్ వైపే మొగ్గు చూపుతున్నట్లు నివేదికలు చెబుతున్నాయి. భారత్ తరఫున ఇప్పటివరకు 9 వన్డేలు ఆడిన గైక్వాడ్ 228 పరుగులు సాధించాడు. ఇటీవల దక్షిణాఫ్రికాపై శతకం కూడా నమోదు చేశాడు. మరోవైపు రోహిత్ శర్మ కూడా వన్డే సిరీస్కు దూరమయ్యే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. అలా జరిగితే సాయి సుదర్శన్ లేదా సంజు శాంసన్కు అవకాశం దక్కవచ్చు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!