
క్రీడలు

టీఆర్ఎస్ చీఫ్ కవిత ప్రధాని నరేంద్ర మోడీకు బహిరంగ లేఖ రాశారు. రేపు ప్రధాని తెలంగాణ పర్యటనకు రానున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రయోజనాలకు సంబంధించిన కీలక అంశాలపై తక్షణ నిర్ణయాలు తీసుకోవాలని ఆమె కోరారు. పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వడం, 2027 జనగణనలో బీసీ గణన, మహిళా రిజర్వేషన్ బిల్లులో బీసీ మహిళలకు సబ్ కోటా, అలాగే తెలంగాణ బీసీ బిల్లుకు ఆమోదం ఇవ్వాలని లేఖలో పేర్కొన్నారు. ఈ ప్రాజెక్టుకు 90 శాతం కేంద్ర నిధులతో పూర్తి చేయాలని కూడా కోరారు. బీసీ జనాభాకు సంబంధించి స్పష్టమైన గణాంకాలు అవసరమని, రిజర్వేషన్లలో న్యాయం జరగాలని ఆమె అభిప్రాయపడ్డారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!