

గోదావరి నదీజలాల విషయంలో బీఆర్ఎస్ తప్పుడు ప్రచారం చేస్తోందని బీజేపీ ఎంపీ రఘునందన్రావు ఆరోపించారు. తెలంగాణకు కేంద్ర ప్రభుత్వం అన్యాయం చేస్తోందంటూ బీఆర్ఎస్ నేతలు కేటీఆర్, హరీశ్రావు అసత్య ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. కేంద్రంపై బురదజల్లేందుకు, ప్రజల్లో అపోహలు కల్పించేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. గోదావరి జలాల అంశంలో వాస్తవాలను ప్రజలకు వివరించాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు.
మళ్లీ తెలంగాణ సెంటిమెంట్ను రాజకీయ ప్రయోజనాల కోసం రెచ్చగొట్టాలని బీఆర్ఎస్ ప్రయత్నిస్తోందని రఘునందన్రావు విమర్శించారు. ఓట్లు, సీట్ల కోసం ప్రజలను రెచ్చగొట్టడం సరికాదని హితవు పలికారు. రానున్న ఎన్నికల్లో బీఆర్ఎస్కు ప్రజలే తగిన బుద్ధి చెబుతారని అన్నారు. నీటి అంశాలను రాజకీయంగా ఉపయోగించుకోవడం కాకుండా వాస్తవాలు, రాష్ట్ర ప్రయోజనాల ఆధారంగా చర్చించాలని ఆయన సూచించారు.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!